వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాపంపిణీకి కేంద్రం నీళ్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎన్‌డిఎ సర్కారు తిలోదకాలు వదిలే సన్నాహాల్లో వున్నదని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌కారత్‌ విమర్శించారు. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 16వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటయిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వత్తిడులకు తలవొగ్గిన కేంద్రం పేదప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ప్రజాపంపిణీ వ్యవస్థను ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన తెలిపారు. గోడౌన్లలో లక్షలాది టన్నుల ధాన్యం పడివున్నా దానిని పేదప్రజలకు చౌకధరలకు విక్రయించడానికి ప్రభుత్వం చొరవచూపడం లేదని ఆయన విమర్శించారు. ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను రాష్ట్రాలకు అప్పగిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగ సమీక్షపై తమ ఆందోళన ఈ రోజు నిజమైందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X