వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మార్వో కార్యాలయంపేల్చివేత
కరీంనగర్; కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఎమ్ఆర్వో కార్యాలయాన్ని జనశక్తి నక్సలైట్లు ఆదివారం ఉదయంపేల్చివేశారు. సుమారు 20 మంది సాయుధులు కార్యాలయంలోని రికార్డులను కాల్చివేయడంతో పాటు శక్తిమంతమైన డిటోనేటర్లతో కార్యాలయ భవనాన్నిపేల్చివేశారు.
వేకువ జామున ఈ సంఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్పారు. కార్యాలయంలోని అనేక ముఖ్యమైన రికార్డులు ఈ సంఘటనలో ధ్వంసమైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. మరో సంఘటనలో హుజురాబాద్ సమీపంలో పోలీసులు పేలుడు పదార్ధాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాన్ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Sunday, May 20, 2001, 23:53 [IST]