టూరిస్టులకోసం వీసా ఆన్ అరైవల్
న్యూఢిల్లీ: టూరిజం పరిశ్రమకు ఊపును ఉత్తేజాన్ని ఇచ్చేందుకు వీలుగా ఎంపిక చేసిన 10 దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే వీసాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయరాహిత్యం కారణంగా వీసా ఆన్ అరైవల్ స్కీమ్ ప్రతిపాదన గత రెండేళ్లుగా పెండింగ్లో వుంది.
అయితే
టూరిజం
రంగంలో
పెరిగిన
తీవ్రమైన
పోటీ
దృష్ట్యా
ప్రభుత్వం
ఈ
స్కీమ్ను
సాధ్యమైనంత
తొందరగా
అమల్లోకి
తేవాలని
యోచిస్తున్నది.
ఈ
స్కీమ్
కింద
పది
దేశాలకు
చెందిన
టూరిస్ట్లు
వీసాకోసం
ప్రయాస
పడకుండా
ఇండియాలో
అడుగుపెట్టిన
తర్వాత
ఎంపిక
చేసిన
విమానాశ్రయాలు,
రేవుల్లో
30
డాలర్లు
చెల్లిస్తే
90
రోజులపాటు
చెల్లుబాటు
అయ్యే
వీసా
జారీ
చేస్తారు.
చట్టపరమైన
అంశాలు,
భద్రతా
పరమైన
అంశాలను
పరిగణలోకి
తీసుకుని
ఏ
పది
దేశాల
టూరిస్టులకు
ఈ
వీసా
సౌకర్యం
కల్పించాలో
నిర్ణయిస్తారు.
తొలుత
ఈ
స్కీమ్ను
భద్రతా
కారణాల
దృష్ట్యా
తీవ్రంగా
వ్యతిరేకించిన
హోం,
విదేశాంగ
మంత్రిత్వ
శాఖలు
చివరకు
పాకిస్తాన్,
బంగ్లాదేశ్
కూడా
ఈ
తరహా
స్కీమ్ను
అమల్లోకి
తేవడంతో
దిగివచ్చాయి.