కేతన్ పరేఖ్కు బెయిల్మంజూరు
ముంబాయి: బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.37బిలియన్ పే ఆర్డర్ కుంభకోణంలో ప్రధాననిందితుడైన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్కు సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్మంజూరు చేసింది. ఆయనతో పాటు మర్కంటైల్ బ్యాంక్మాధవాపుర శాఖ మేనేజర్ జె.బి. పాండ్యాకు కూడా కోర్టు బెయిల్మంజూరు చేసింది.
అదనపు సెషన్స్ జడ్జిఎ.ఆర్. జోషి ఐదేసి లక్షల రూపాయల పూచీకత్తుపైనిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ- కోర్టు అనుమతి లేకుండాదేశం వదిలి వెళ్లకూడదని షరతువిధించారు. చార్జీషీట్ దాఖలు చేసే వరకు ప్రతిసోమవారం, గురువారం సిబిఐ కార్యాలయానికి హాజరు కావాలని కోర్టువారిద్దరిని ఆదేశించింది.
మాధవాపుర మర్కంటైల్ బ్యాంక్మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర పాండ్యానుఅహ్మదాబాద్ నుంచి ముంబాయికి రప్పించి స్పెషల్ కోర్టుముందు హాజరు పరిచారు. ఆయనను మే 28వ తేదీవరకు పోలీసు కస్టడీకి రిమాండ్ చేశారు. ఇదేకేసులో అరెస్టయిన రమేష్ పరేఖ్కు ఐదు లక్షలరూపాయల బాండ్పై షరతులతో కూడిన బెయిల్ను కోర్టు ఏప్రిల్ 11వ తేదీనమంజూరు చేసింది.