వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంసన్నాహాలుప్రారంభించింది. సుప్రీం కోర్టు విధించిన జులై నెలాఖరు గడువుకంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం వుంది. పార్టీ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నాడు సమావేశమై ఈ విషయం చర్చించారు. రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి చేసి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టుగా పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలిసింది.
జులై మొదటి వారంలో ఎన్నికల నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం వున్నదని అంటున్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రస్తుత అయిదంచెల విధానానికి బదులుగా మూడంచెల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రవేశపెట్టిన బిల్లుకు చుక్కెదురు కావడానికి కాంగ్రెస్‌ ప్రధాన కారణమని ముఖ్యమంత్రి దుయ్యబట్టినట్టుగా తెలిసింది. అఖిలపక్ష సమావేశంలో కూడా కాంగ్రెస్‌ మొండి వైఖరిని అవలంభించిందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X