వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాప్రాజెక్టులపై బాబు దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణా రైల్వే ప్రాజెక్టులకుసత్వరమే అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు మంగళవారం రైల్వే మంత్రినితీష్‌కుమార్‌ను కోరారు. వెనుకబడిన తెలంగాణాలోని రెండురైల్వే ప్రాజెక్టులకు, రాయలసీమలోని రెండురైల్వే ప్రాజెక్టులకు వెంటనే అనుమతి ఇవ్వాలనిఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రియశ్వంత్‌ సిన్హాను కూడా కలిసి ఆర్థిక స్థితిగతులపైచర్చించారు.

ఈ ప్రాజెక్టుల అమలుకు ఎక్కువనిధులు మంజూరు చేయాలని కూడా ఆయనకోరారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ప్రాతిపదికపైనిధులు అందించాల్సి వుంటుందని ఆయన అన్నారు.కె. చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితి చేపట్టిన ప్రత్యేక తెలంగాణాఉద్యమం ఊపందుకోవడంతో చంద్రబాబునాయుడు వెనుకబడిన ప్రాంతాలఅభివృద్ధికి ముమ్మర చర్యలుచేపట్టారు. ఇందులో భాగంగానే ఆయనకేంద్ర మంత్రులను కలిసి, చర్చలుజరిపారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులుకేంద్ర మంత్రులను కలిశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X