వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ నేతలమాటలు బేఖాతర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మణిపూర్‌లో పరిస్థితి భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు చెప్పుతున్నమాటలకు భిన్నంగా వుంది. ప్రభుత్వ ఏర్పాటుకుమణిపూర్‌ బిజెపి నేత దోరేంద్ర సింగ్‌ వేగంగాసన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగాఆయన ప్రగతిశీల ప్రజాస్వామిక కూటమిని ఏర్పాటుచేశారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేఅధికారాన్ని కూటమి భాగస్వామ్య పక్షాలు దోరేంద్ర సింగ్‌కుఅప్పగించాయి.

మణిపూర్‌లో బిజెపి శాసనసభ్యులుప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలుచేయబోరని బిజెపి జాతీయ నేత నరేంద్ర మోడీఅన్నారు. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో సమతా పార్టీ నేత జార్జిఫెర్నాండెజ్‌ సమావేశమైన తర్వాత నరేంద్ర మోడి ఈ ప్రకటనచేశారు. కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించిన బిజెపి శాసనసభ్యులపైచర్య తీసుకునే విషయంపై కూడా ఈ నెల 28వ తేదీ తర్వాతనే ఆలోచిస్తామనిఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, మణిపూర్‌ పరిణామాలుజార్ఖండ్‌లోని బాబూలాల్‌ మరండీ ప్రభుత్వానికి తలనొప్పిగాపరిణమించాయి. బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలోతాము బిజెపికి మద్దతు ఉపసంహరించుకుంటామని సమతా పార్టీనాయకులు ప్రకటించడంతో మరండీప్రభుత్వానికి ప్రమాదం ముంచుకొచ్చింది. మరండీప్రభుత్వానికి ఐదుగురు సమతా శాసనసభ్యులమద్దతు వుంది. ఈ నెల 28 తేదీ వరకుయథాదథ స్థితి కొనసాగించేందుకు వాజ్‌పేయితో జార్జిఫెర్నాండెజ్‌కు ఒప్పందం కుదరడంతో మరండీతాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X