మద్యం లాబీతో ప్రభుత్వంకుమ్మక్కు: కాంగ్రెస్
హైదరాబాద్ : మద్యంలాబీతో కుమ్మక్కయిన ప్రభుత్వం రాష్ట్రంలోవిచ్ఛలవిడిగా బార్ లైసెన్సులను మంజూరుచేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికె. రోశయ్య ఆరోపించారు. ప్రజలకు తాగేందుకు గుక్కెడునీళ్లివ్వలేని తెలుగుదేశం ప్రభుత్వంరాష్ట్రంలో మద్యం ఏరులు పారిస్తున్నదని ఆయనదుయ్యబట్టారు. మద్యం లాబీతో కుమ్మక్కుకాబట్టే ప్రభుత్వం బార్లకు 9 శాతం అమ్మకపు పన్నునురద్దు చేసిందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నీరు-మీరు కార్యక్రమాన్నితెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మార్చేసిందనిఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధికల్పించేందుకు మాత్రమే ఇదిఉపయోగపడుతోందని ఆయన అన్నారు. నీరు-మీరు కార్యక్రమంఅమలు విషయంలో ప్రభుత్వానికి నిర్దిష్ట విధానంలేదని ఆయన అన్నారు. పాలక పక్షానికిచెందినవారు చేపట్టే పనులకు ప్రభుత్వంనిధులు విడుదల చేస్తోందని, ప్రతిపక్షాలుచేపట్టే పనులకు విడుదల చేయడంలేదని ఆయన చెప్పారు. నీరు-మీరు అమలుపైప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.