ఇచ్చంపల్లి దిగువన ఎత్తిపోతల
న్యూఢిల్లీ: తెలంగాణాకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం సత్వరం ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని వాజ్పేయిని కోరారు. సోమవారం నాడు ప్రధానిని కలసిన చంద్రబాబు గోదావరిపై తెలంగాణాలో నిర్మించతలపెట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు.
ఇచ్చంపల్లికి దిగువన గోదావరిపై సరికొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టాలని కూడా చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 50 టిఎంసి సామర్ధ్యం గల ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. దీని నిర్మాణానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు కాగలవని భావిస్తున్నట్టుగా ఆయన ప్రధానికి వివరించారు.
ఈ
ఎత్తిపోతల
పథకంపై
ఎలాంటి
వివాదం
తలెత్తే
అవకాశం
లేనందున
ప్రధాని
చొరవ
తీసుకుని
కేంద్ర
జల
సంఘం
అనుమతినిప్పించాలని
ముఖ్యమంత్రి
కోరారు.
ఇచ్చంపల్లి
ప్రాజెక్టుపై
మహారాష్ట్ర,
చత్తీస్గఢ్తో
కలసి
జాయింట్
కంట్రోల్
బోర్డును
కూడా
వీలున్నంత
తొందరగా
ఏర్పాటు
చేయాలని
ఆయన
విజ్ఞప్తి
చేశారు.
ముఖ్యమంత్రితో
పాటు
ప్రధానిని
కలసినవారిలో
దేశం
పార్లమెంటరీ
పక్షం
నాయకుడు
ఎర్రన్నాయుడు,
వేణుగోపాలాచారి,
గంగారెడ్డి,
ఎస్
రామచంద్రారెడ్డి,
యనమల
రామకృష్ణుడు,
మండవ
వెంకటేశ్వరరావు
వున్నారు.