వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్‌ మంటలపై మంతనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌డిఎలో మణిపూర్‌ వ్యవహారం సృష్టించిన సంక్షోభంపై సమతాపార్టీ అగ్రనేత జార్జ్‌ఫెర్నాండెజ్‌తో ప్రధాని వాజ్‌పేయి మంగళవారం నాడు సమావేశమై చర్చిస్తున్నారు. మణిపూర్‌లో సమతాపార్టీ నాయకుడు రాధా వినోద్‌ కొయిజామ్‌ మూడు నెలల క్రితమే ఏర్పాటు చేసిన ప్రభుత్వం బిజెపి సభ్యుల చలువతో కుప్పకూలిపోయింది.

సోమవారం నాడు జరిగిన విశ్వాస పరీక్షలో కొయిజామ్‌ సర్కారుకు మద్దతునిస్తామని ప్రకటించిన బిజెపి ఎమ్మెల్యేలు ఆఖరు క్షణంలో అడ్డం తిరిగిన విషయం విదితమే. బిజెపి ధోరణిపై తీవ్ర ఆగ్రహంతో వున్న సమతాపార్టీ ఎన్‌డిఎనుంచి వైదొలగనున్నట్టుగా హెచ్చరించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతామని సమతాపార్టీ నేతలు ముందుగానే హెచ్చరించినప్పటికీ మణిపూర్‌ బిజెపి నేతలు లెక్కచేయకపోవడం గమనార్హం.

ఎన్‌డిఎ నుంచి వైదొలగాలని దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చిన సమతాపార్టీ నేతలు ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం పార్టీ అగ్రనేత జార్జ్‌ ఫెర్నాండెజ్‌ భుజాలపై వుంచారు. బిజెపి వైఖరిపై జార్జ్‌ కూడా కినుకగా వున్నారు. సోమవారం నాడు ప్రధాని ఏర్పాటు చేసిన ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. సమతపార్టీ నేతల ప్రతిస్పందనను గమనించిన ప్రధాని వాజ్‌పేయి స్వయంగా రంగంలోకి దిగి కొయిజామ్‌ ప్రభుత్వం స్థానే బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నించకుండా అడ్డుకున్నారు. ఎన్‌డిఎనుంచి సమత వైదొలగకుండా ఒప్పంచే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ప్రధాని ప్రయత్నాలు విఫలమైతే ఎన్‌డిఎ పీఠానికి ఎసరువచ్చే అవకాశం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X