వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎటూ తేలని ఎన్‌డిఎవివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మణిపూర్‌ సంక్షోభంపై సమతాపార్టీ అగ్రనేత జార్జ్‌ఫెర్నాండెజ్‌ మంగళవారం నాడు ప్రధాని వాజ్‌పేయిని కలసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 28 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. 28న మణిపూర్‌ నుంచి ఉభయపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీ రప్పించి ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తారు.

ఈ లోపు మరికొన్ని దఫాలు ప్రధానితో ఇతర ఎన్‌డిఎ నేతలతో సమావేశం కానున్నట్టు జార్జ్‌ఫెర్నాండెజ్‌ చెప్పారు. మణిపూర్‌ సమస్య పరిష్కారానికి తనకు కొంత వ్యవధి కావాలని ప్రధాని కోరినట్టుగా తెలిసింది. మణిపూర్‌లో కోయిజామ్‌ సారథ్యంలోని సమతాపార్టీ ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్షలో బిజెపి ఎమ్మెల్యేలు ఓడించిన విషయం విదితమే. ఈ పరిణామంతో ఆగ్రహంగా వున్న సమతాపార్టీ నేతలు ఎన్‌డిఎ నుంచి వైదొలుగుతామని హెచ్చరికలు జారీ చేశారు. మణిపూర్‌లోని తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లాగైనా ఒప్పించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చూస్తామని బిజెపి నేతలు హామీ ఇస్తున్న సమతాపార్టీ నేతలు చల్లబడలేదు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా వున్నట్టుగా మణిపూర్‌నుంచి వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X