పాపారావుపై క్రమశిక్షణ చర్య
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి నేత చంద్రశేఖర్రావుకు మద్దతు ప్రకటించిన సిరిసిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే పాపారావుపై తమ పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోనున్నట్టుగా పిసిసి నేత సత్యనారాయణరావు ప్రకటించారు.ప్రత్యేక తెలంగాణా డిమాండ్తో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఫోరం ఏర్పాటు చేసి పోరాడాలని నిర్ణయించినప్పటికీ దానితో సంబంధం లేకుండా పాపారావు టిఆర్ఎస్లో చేరుతున్నట్టుగా ప్రకటించిన విషయం విదితమే. కరీంనగర్లో జరిగిన తెలంగాణా సింహగర్జన ఏర్పాట్లలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం జాబితాపై అధిష్టానవర్గంతో చర్చలు జరిపేందుకు మంగళవారం నాడు సత్యనారాయణరావు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సారి వచ్చేప్పుడు పిసిసి, డిసిసిల జాబితాలను వెంటతీసుకుని రాగలనన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీకల్లా జాబితాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుల జాబితా ఖరారులో జాప్యానికి ఏకాభిప్రాయ సాధనకు జరుగుతున్న ప్రయత్నాలు తప్ప మరోకారణం లేదని ఆయన స్పష్టం చేశారు.