గాడ్బోలే రాజీనామా-ఉపసంహరణ
ముంబయ్ః ఎన్రాన్వివాదం మరింత తీవ్ర రూపం ధరించింది. సంప్రదింపుల కమిటీ సారధ్యం నుంచి హోం శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ మాధవ్ గోడ్బొలే బుధవారం హఠాత్తుగారాజీనామా చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.తన సామర్ధ్యంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ అనుమానం వ్యక్తం చేయడంతో తాను సంప్రదింపుల కమిటీ సారధ్యానికి రాజీనామా చేసినట్లు డాక్టర్ గాడ్బొలే బుధవారం వెల్లడించారు.
ప్రతిష్ఠాత్మకమైన ఎన్రాన్ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రవిద్యుత్ బోర్డుకు, ఎన్రాన్ కు మధ్య పెద్ ఎత్తునవివాదం చెలరేగిన విషయం విదితమే. ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకువీలుగా సంప్రదింపులు జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గాడ్బొలే ను సంప్రదింపుల కమిటీ ఛైర్మన్ గా నియమించింది. అయితే గాడ్బొలే అన్నివిషయాల్లో ప్రతికూల ధోరణిని ప్రదర్శిస్తారంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ మంగళవారం ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు.
పవార్ వ్యాఖ్యలకు కినుక వహించిన గాడ్బొలే తన రాజీనామాను మహారాష్ట్ర ముఖ్యమంత్రివిలాస్ రావ్ దేశ్ ముఖ్ కు పంపారు. ముఖ్యమంత్రితో టెలిఫోన్ లో కూడా మాట్లాడినట్లు గాడ్బొలేవివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎలా నెట్టుకొస్తుందో... ఎన్రాన్ సమస్యకు ఏ పరిష్కారం సాధిస్తుందో వేచి చూడాలి.
గాడ్బోలే రాజీనామాఆయన వ్యక్తిగత నిర్ణయమని ఎన్సిపి నేతశరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఎన్రాన్ విషయాన్నిఆయన మధ్యలోనే వదిలేయడం సరికాదని పవార్ అన్నారు.