జయపై సుప్రీంలో రిట్దాఖలు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగాఅన్నాడియంకె నేత జయలలిత చేత ప్రమాణస్వీకారం చేయించడాన్ని సవాల్ చేస్తూ బుధవారంసుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. కపూర్ అనేన్యాయవాది ప్రజా ప్రయోజనాల వాజ్యం కింద ఈ రిట్పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగాజయలలిత తీసుకున్న నిర్ణయాలను రద్దుచేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హురాలైన జయలలితను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగంలోని 14 అధికరణనుధిక్కరించడమే అవుతుందని ఆయన తన రిట్పిటిషన్లో అన్నారు.
ఇదిలా వుండగా, ప్రభుత్వ ఏర్పాటుకుజయలలితను ఆహ్వానించిన గవర్నర్ ఫాతిమా బీవినివెనక్కి పిలవాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోమని తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి, డిఎంకె నాయకుడు కరుణానిధిచెప్పారు. పార్టీ కార్యవర్గ సమావేశానంతరంఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు.జయలలిత నియామకాన్ని కోర్టుల్లో కూడా సవాల్చేయబోమని ఆయన అన్నారు. జయలలితను ముఖ్యమంత్రిగానియమించినందుకు నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్నిబహిష్కరిస్తామని ఆయన చెప్పారు.