జడ్చర్లలో పరిశ్రమలకు భారీ పార్క్
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వేయి ఎకరాల్లో కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్పార్క్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డునిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతనబుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకునిర్ణయం తీసుకున్నారు. మెగా ప్రాజెక్టులకు ఎస్కార్ట్అధికారులను నియమించాలని కూడాసమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు భారీ పరిశ్రమల మంత్రికె. విద్యాధరరావు విలేకరులతో చెప్పారు.
ప్రోత్సాహక బోర్డుసమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనేఉత్తర్వులుగా మార్చి జారీ చేయాలని ముఖ్యమంత్రిఅధికారులను ఆదేశించారు. దీని వల్ల నిర్ణయాలఅమలు వెంటనే జరగడానికి వీలుంటుందనివిద్యాధరరావు చెప్పారు. ఐదు వందల కోట్ల పైబడిపెట్టుబడులు పెట్టి అమలు చేసే భారీ ప్రాజెక్టులుసకాలంలో పూర్తి చేస్తే పన్ను మినహాయింపుఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
మెదక్ జిల్లా జహీరాబాద్లో పరిశ్రమలకు సరిగానీరందడం లేదని, సమస్యను తీర్చి పరిశ్రమలఅభవృద్ధికి తోడ్పడేందుకు సింగూరు ప్రాజెక్టునుంచి నీటిని తరలించాలని నిర్ణయం తీసుకున్నామనివిద్యాధరరావు చెప్పారు.