కోట్లుమింగిన ఎయిర్ ఇండియా ఎండి సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిరిండియా(ఎఐ)కు కోట్ల రూపాయలో నష్టాలు రావటానికి కారణమైనారన్న ఆరోపణలపై ఎఐ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ మాస్కరేన్హాను సస్పెండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.లండన్లోనిఎయిర్లైన్స్ జనరల్ సేల్స్ ఏజెంట్ వెల్కం ట్రావెల్స్కు అనుకూలంగా మితిమీరి వ్యవహరించి ఎయిరిండియాకు కోట్లాది రూపాయల నష్టానికి కారణమయ్యారన్న ఆరోపణలను మైఖేల్ ఎదుర్కొంటున్నారు.
జనరల్ సేల్స్ ఏజెంటుకు కొన్ని అంగీకరించని చెల్లింపులు చేసినందుకుగాను ఎయిరిండియా రీజినల్ డైరెక్టర్ (ఇండియా)గా పనిచేస్తున్న పి.కె.సిన్హాను కూడా సస్పెండ్ చేసినట్టు ఆ వర్గాలుపేర్కొన్నాయి.మళ్లీ ఆదేశాలు వెలువడే వరకు ఇన్ఛార్జ్ వ్యవహరించమని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జె.ఎస్.గొగోయ్ను ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయమని సిబిఐని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా,
ముంబాయిలోవున్న
మైఖేల్
సస్పెన్షన్
ఉత్తర్వులనుఅంగీకరించటానికి
తిరస్కరించారు.
సస్పెన్షన్ను
అక్రమ,
దురుద్దేశపూర్వక
చర్యగాపేర్కొంటూ
కోర్టులో
సవాలు
చేసేందుకు
ఆయన
సిద్ధమవుతున్నారని
తెలిసింది.