వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంటల్లో భారతఆయుధాగారం
న్యూఢిల్లీ: రాజస్థాన్లోని గంగానగర్జిల్లాలో గల మిర్ధాల్ సమీపంలో వున్న సైనికఆయుధాగారంలో గురువారం మధ్యాహ్నం భారీఅగ్ని ప్రమాదం సంభవించింది. భారీ, మధ్యతరహా ట్యాంక్షెల్స్, క్షిపణులు, రాకెట్లు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. అయితే, ప్రాణనష్టమేమీ సంభవించలేదు. సమీపంలోని గ్రామాలనుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాకపోకలనునిలిపేశారు. సమీపంలోని జాతీయ రహదారినిమూసేశారు.
మంటలను అదుపు చేయడానికి భారతసైనికాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయుధాలు పేలుతుండడంతో ఈప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. అగ్ని ప్రమాదానికికారణాలేమిటో తెలియాల్సి వుంది.
గత ఏడాది కాలంలో ఈవిధమైన అగ్ని ప్రమాదం జరగడం ఇదిమూడవసారి.
Comments
Story first published: Thursday, May 24, 2001, 23:53 [IST]