వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌, పాక్‌లహురియత్‌ తగాదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌సమస్యపై పాకిస్ధాన్‌తో చర్చలు జరపాలని నిర్ణయించిన భారత ప్రభుత్వంచర్చల్లో హురియత్‌ కాన్ఫరెస్‌కు స్ధానంకల్పించేందుకు మాత్రం ససేమిరా అంది. కాశ్మీర్‌పైనేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్న తరువాత ఇకహురియత్‌ అవసరం ఏముంటుందని హోమ్‌ శాఖా మంత్రి అద్వానిప్రశ్నించారు. అయితే, కాశ్మీర్‌ అభివృద్దికోసం తీసుకోవాల్సినచర్యల విషయంలో మాత్రం హురియత్‌ తనసలహాలు ఇవ్వవచ్చునని అద్వాని అన్నారు.

ఇదిలా వుండగా, కాశ్మీర్‌లో భారత్‌ కాల్పులవిరమణపూనుకోవటం సిగ్గుపడాల్సిన విషయమనిపాకిస్ధాన్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంపైతీవ్రవాదులు వారి నిర్ణయం వారు తీసుకుంటారనిఆయన అన్నారు.

కాగా, చర్చల్లో హురియత్‌కాన్ఫరెన్స్‌కు స్ధానం ఉండాలని ముషరఫ్‌ ప్రతినిధి స్పష్టంచేశారు. ముషరఫ్‌ ప్రతినిధి రషీద్‌ ఖురేషీ మాట్లాడుతూచర్చల్లో ఇండియా, పాకిస్ధాన్‌, హురియత్‌కాన్ఫరెస్‌లు మూడూ పాల్గొంటేనే ఆశించిన ఫలితంఉంటుందని అన్నారు.

కాగా, భారత్‌ తీసుకన్న నిర్ణయాన్నిఅమెరికా అభినందించింది. ఈ అవకాశాన్ని పాక్‌ సక్రమంగాఉపయోగించుకుని 11 సంవత్సరాల తిరుగుబాటుకుతెరదించాలని అమెరికా కోరింది.ఈ చర్చలు శాంతినిస్ధాపిస్తాయన్న అశాభావాన్ని చైనా వ్యక్తంచేసింది. భారత్‌ నిర్ణయాన్ని పాక్‌ పత్రికలుఅభినందించాయి.

చర్చల్లో తమకూభాగస్వామ్యం ఉండాలని హురియత్‌ కాన్ఫరెస్‌కోరింది. తాము లేని చర్చలు సత్పలితాన్నిఇవ్వబోవని హురియత్‌ నేత ఫరూక్‌ అన్నారు.

పాక్‌ మిలిటరీ పాలకుడు ముషరఫ్‌తోతాము ప్రత్యేకంగా సమావేశం కావాలని కాశ్మీరీపండిట్‌లు కోరుకుంటున్నారు. తమ సమస్య కాశ్మీర్‌సమస్యతో ముడిపడి ఉందని వారన్నారు. భారత్‌ ప్రభుత్వ దూత కె.సి.పంత్‌ తమనునిర్లక్ష్యం చేయటం పట్ల కాశ్మరీ పండితులనాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X