వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ ఆహ్వానానికి పాక్‌ఓ.కె.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పాకిస్తాన్‌సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ను చర్చలకు ఆహ్వానిస్తూ భారత ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భారత్‌ తో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చలకు సిద్ధమంటూ ముషారఫ్‌ చాలాకాలంగా ప్రకటనలు చేస్తున్నవిషయం విదితమే. కాశ్మీర్‌ లో కాల్పుల విరమణను ప్రకటించి ప్రపంచ దేశాల నీరాజనాలందుకున్న వాజ్‌పేయి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ తో చర్చలకుస్నేహహస్తం చూపడం విశేషం.

వాజ్‌ పేయి ప్రభుత్వం ప్రతిపాదనకు పాకిస్తాన్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం రాగానే భారత్‌ తో చర్చలకు సమ్మతని తెలుపుతామని పాక్‌ రేడియో ప్రకటించింది. చాలాకాలంగా అంతంత మాత్రంగా వున్న భారత్‌ పాకిస్తాన్‌ సంబంధాలు తాజా పరిణామాలతో కొత్తపుంతలు తొక్కుతాయని భావిస్తున్నారు.

కీలకమైన ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రధాని వాజ్‌పేయి ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఆమోదం కూడా తీసుకోవడం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతుంది. ముందుగానే సోనియా గాంధీతో చర్చించారు కాబట్టి ముషారఫ్‌ ను చర్చలకు ఆహ్వానించడంపై నోరెత్తలేని కాంగ్రెస్‌ పార్టీ కాల్పులవిరమణకు స్వస్తి చెప్పడాన్ని ప్రశ్నించింది. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా స్పందించాల్సి వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X