ప్రత్యేక తెలంగాణా వద్దు: ఎర్రం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు డిమాండ్ను తెలుగుదేశం గురువారంనాడు తోసిపుచ్చింది. తెలంగాణా అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు పరిష్కారం కాదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో జరిగే మహానాడులో ఒక తీర్మానం కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రాన్ని 35 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని, తన హయాంలో తెలంగాణాను కాంగ్రెస్ అభివృద్ధి చేసి వుంటే ఈ సమస్య వుత్పన్నమై వుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరాన్ని బట్టి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్చలు చేపట్టాల్సిందే గానీ వేర్పాటు ధోరణి సరికాదని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, తెలంగాణా అభివృద్ధికి రాష్ట్ర విభజన పరిష్కారం కాదని తొమ్మిది వామపక్షాలు అభిప్రాయపడ్డాయి. తెలంగాణా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల నేతలు గురువారం గవర్నర్ సి. రంగరాజన్కు ఒక వినతి పత్రం సమర్పించారు.
మొత్తం
14
ప్రతిపాదనలతో
వారు
గవర్నర్కు
ఈ
వినతి
పత్రం
అందజేశారు.
సమైక్యాంధ్రలోనే
తెలంగాణా
అభివృద్ధికి
పరిష్కారాలు
వెతకాలని
వారన్నారు.
తెలంగాణా
అభివృద్ధికి
ఐదు
వేల
కోట్ల
రూపాయలు
విడుదల
చేసి
ప్రాంతీయ
కమిటీలు
వేయాలని
కూడా
వారు
గవర్నర్ను
కోరారు.