వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్డిఎ మనుగడ కష్టమే: ఏచూరి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమేనని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) లోని కలహాలు దేశ పాలనపై ప్రభావం చూపుతాయని ఆయన గురువారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.
ఎన్డిఎలో పరిస్థితులు అస్తవ్యస్థంగా వున్నాయని, ఈ పరిస్థితులు ఎన్డిఎ ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్డిఎ ప్రభుత్వం 1998లో సమత, మమత, జయలలితల మద్దతుతో ఏర్పడిందని, ఇప్పటికే మమత, జయలలిత వెళ్లిపోయారని, సమతా పార్టీ కూడా బయట పడడానికి సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్డిఎ ప్రభుత్వం నేడోరేపో కూలిపోవడం ఖాయమని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, May 24, 2001, 23:53 [IST]