వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు, జయాజైట్లీలకు నోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తహల్కా బయటపెట్టిన రక్షణ శాఖ అవినీతి కుంభకోణంపై దర్యాప్తు జరుతున్న జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌, సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీ తో సహా 25 మందికి నోటీసులు జారీ చేసింది. తహల్కా ఆరోపణలపై వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్‌ వారిని ఆదేశించింది. కమిషన్‌ నోటీసులు పంపిన వారిలో ముగ్గురు మేజర్‌ జనరల్స్‌ కూడా వున్నారు.

తహల్కా వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సైనిక న్యాయస్థానం మేజర్‌ జనరల్‌ పిఎస్‌కె చౌధరి, మేజర్‌ జనలర్‌ మంజిత్‌సింగ్‌ అహ్లూవాలియాలను తప్పుపట్టిన విషయం విదితమే. వెంకటస్వామి కమిషన్‌ విచారణ జూన్‌ 6 నుంచి ప్రారంభమవుతుంది. బంగారు లక్ష్మణ్‌ పర్సనల్‌ సెక్రెటరి సత్యమూర్తికి కూడా నోటీసులు పంపారు. సమతాపార్టీ మాజీ కోశాధికారి ఆర్‌కెజైన్‌, అదే పార్టీ సీనియర్‌ నేతలు సురేంద్రసింగ్‌ సులేఖా, రక్షణ మంత్రిత్వ శాఖలో అడిషనల్‌ సెక్రటరీగా పనిచేసిన ఎల్‌ఎమ్‌ మెహతాకు కూడా నోటీసులను వెంకటస్వామి కమిషన్‌ పంపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X