ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడివున్నాం
న్యూఢిల్లీ: తాము ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడివున్నామని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తమ పార్టీ ఎజెండాలోవున్నదని ఆయన శుక్రవారం విలేకరులసమావేశంలో చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తువల్లనే తాము ప్రత్యేక తెలంగాణాడిమాండ్ను పక్కన తాత్కాలికంగా పెట్టాల్సి వచ్చిందనిఆయన అన్నారు. కాకినాడలో 1997లో ప్రత్యేక తెలంగాణా కోసం తీర్మానంచేశామని, మిగతా ప్రాంతాలవారిని కూడా విశ్వాసంలోకి తీసుకుని,అందరినీ ఒప్పించి తాము ఈ తీర్మానం చేశామని, రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఇరు ప్రాంతాలకుప్రయోజనం చేకూరుతుందని గట్టిగా నమ్ముతున్నామనిఆయన వివరించారు.
మిత్రపక్షమైనతెలుగుదేశం ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తుండడంవల్లనే ప్రత్యేక తెలంగాణా డిమాండ్తోఉద్యమం నడపడానికి తమకు తమ పార్టీఅధిష్ఠానం అంగీకారం అవసరమైందని ఆయనచెప్పారు. తమ డిమాండ్ అంగీకారం కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నామని,తాము తప్పకుండాఅధిష్టానాన్ని ఒప్పిస్తామని ఇంద్రసేనా రెడ్డి అన్నారు.