వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ కు బాలకృష్ణ బ్రేక్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃవిశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్డీఆర్‌ మనుమడు, నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన నిన్ను చూడాలని సినిమాకు రాష్ట్ర రాజధాని నగరంలో బ్రేక్‌ పడింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ బాబాయి నందమూరి హరికృష్ణ నటించిన నరసింహనాయుడు చిత్రమే హైదరాబాద్‌ లోనిదేవీ ధియేటర్‌ లో నిన్ను చూడాలనిచిత్ర ప్రదర్శనకు అడ్డుపడడంవిశేషం.

రాజధానిలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ లోని దేవి ధియేటర్‌ లో నరసింహనాయుడు హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నది. అయితే ఆ సినిమాస్థానంలో నిన్ను చూడాలనిచిత్రాన్ని రిలీజ్‌ చేయాలని ధియేటర్‌ యాజమాన్యం అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. శుక్రవారం ఉదయం నిన్ను చూడాలని రిలీజ్‌ సమయంలోనరసింహనాయుడుచిత్ర నిర్మాత మొదలుకొని, బాలకృష్ణ అభిమానులు నరసింహావతారం ఎత్తారు. మా అభిమాన నటుడి సినిమా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తుంటే దాన్ని ఎత్తేసి ఈ సినిమా ప్రదర్శిస్తారా?అంటూ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు.

థియేటర్‌ యాజమాన్యానికి, నరసింహనాయుడుఅభిమానులకు మధ్య శుక్రవారం ఉదయంపెద్దఎత్తున వాగ్వివాదం జరిగింది. దీనితో నిన్ను చూడాలనిచిత్ర ప్రదర్శన దేవీ థియేటర్‌ లో నిలిచిపోయింది.నరసింహనాయుడు అభిమానులు ఇంకా హడావుడి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనితో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ పరిసర ప్రాంతాల్లోస్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

దేవి.... రామోజీ లింక్‌!!!!
నిన్ను చూడాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ కు హీరో గా తొలిచిత్రం. ప్రముఖ చిత్ర నిర్మాత, ఈనాడు గ్రూప్‌ అధిపతి రామోజీ రావు ఈ చిత్రానికి నిర్మాత. ఎస్‌.ఎ. రాజ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి ఎక్స్‌ పెక్టేషన్స్‌ వున్నాయి. రాష్ట్రమంతటా ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే రాజధానిలోని మెయిన్‌ థియేటర్‌ దేవి లో మాత్రం వివాదం తలెత్తింది. జూనియర్‌ ఎన్డీఆర్‌ బాబాయి అయిన నందమూరి బాలకృష్ణ అభిమానులేనిన్ను చూడాలనికి బ్రేక్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది.

రామోజీ రావు నిర్మించిన శుభవేళ చిత్రం విషయంలో కూడా గతంలో దేవీ థియేటర్‌ లోనే గొడవ జరిగింది. సెన్సార్‌ చేసిన సీన్లు ప్రదర్శిస్తున్నందుకు దేవీ ధియేటర్‌లో శుభవేళ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇప్పుడు హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్ననరసింహనాయుడు చిత్ర ప్రదర్శనను నిలిపివేసి రామోజీ రావు సినిమా ప్రదర్శించేంకే ధియేటర్‌ యాజమాన్యం మొగ్గు చూపడం వివాదంగా మారింది. ఈ రెండు సందర్భాలలో దేవి థియేటర్‌ యాజమాన్యం అవసరానికి మించి రిస్క్‌ తీసుకోవడంతో రామోజీ రావుకు..... దేవీ థియేటర్‌ యాజమాన్యానికి వున్న లింక్‌ ఏమిటంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X