వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో ఐదుగురు జవాన్లు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: ముస్లింతీవ్రవాదులు పెట్టిన మందుపాతర పేలడంతో శుక్రవారంకాశ్మీర్‌లో భారత భద్రతా దళాలకు (సిఆర్‌పిఎఫ్‌కు)చెందిన ఐదుగురు జవాన్లు మరణించారు.మరో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు జవాన్లు అక్కడికక్కడేమరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు.

కాశ్మీర్‌లో ముస్లిం గెరిల్లాలపై భద్రతాదళాల దాడులు కొనసాగుతాయని భారతదేశం ప్రకటించిన 48 గంటల లోపే ఈ సంఘటనజరిగింది. జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలోనిఉద్ధంపూర్‌ జిల్లాలో సిఆర్‌పిఎఫ్‌ బృందం పెట్రోలింగ్‌చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మిలిటింట్ల కోసం గాలింపుచర్యలు చేపట్టేందుకు అదనపు బలగాలు సంఘటనా స్థలానికిచేరుకున్నాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలోచేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X