వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్లో ఐదుగురు జవాన్లు బలి
జమ్మూ: ముస్లింతీవ్రవాదులు పెట్టిన మందుపాతర పేలడంతో శుక్రవారంకాశ్మీర్లో భారత భద్రతా దళాలకు (సిఆర్పిఎఫ్కు)చెందిన ఐదుగురు జవాన్లు మరణించారు.మరో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు జవాన్లు అక్కడికక్కడేమరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు.
కాశ్మీర్లో ముస్లిం గెరిల్లాలపై భద్రతాదళాల దాడులు కొనసాగుతాయని భారతదేశం ప్రకటించిన 48 గంటల లోపే ఈ సంఘటనజరిగింది. జమ్మూకు 70 కిలోమీటర్ల దూరంలోనిఉద్ధంపూర్ జిల్లాలో సిఆర్పిఎఫ్ బృందం పెట్రోలింగ్చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మిలిటింట్ల కోసం గాలింపుచర్యలు చేపట్టేందుకు అదనపు బలగాలు సంఘటనా స్థలానికిచేరుకున్నాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలోచేర్పించారు.
Comments
Story first published: Friday, May 25, 2001, 23:53 [IST]