కొలిక్కి రాని మణిపూర్సంక్షోభం
న్యూఢిల్లీ: మణిపూర్సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రగతిశీలప్రజాస్వామ్య కూటమి శాసనసభ్యులు శుక్రవారం భారతీయ జనతా పార్టీ(బిజెపి) అగ్రనేతలతో సమావేశం కానున్నారు. అయితే,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బిజెపి,ఎంఎన్సిపిలతో ఏర్పడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమివెనక్కి తగ్గే సూచనలు కనిపించడంలేదు ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (పిడిఎ)కిచెందిన 34 మంది శాసనసభ్యులు గురువారంనాడేడిల్లీకి చేరుకున్నారు. ఇందులో 24 మంది శాసనసభ్యులు బిజెపికిచెందినవారే.
ప్రధాని వాజ్పేయి, సమతా పార్టీ నేత జార్జిఫెర్నాండెజ్ల మధ్య జరిగిన సమావేశం ఈనెల 28వ తేదీ వరకు యధాతద స్థితిని కొనసాగించాలని తీసుకున్ననిర్ణయాన్ని కూడా బేఖాతరు చేస్తూ బిజెపి శాసనసభ్యులుపిడిఎను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, మణిపూర్లో రాష్ట్రపతి పాలననువిధించాలనుకుంటే కూడా వ్యతిరేకించడానికి పిడిఎసన్నద్ధమవుతూ వుంది. సమతా పార్టీనేతృత్వంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేప్రయత్నాలకు కూడా బిజెపి శాసనసభ్యులు అంగీకరించే పరిస్థితిలేదు. దీంతో బిజెపి అధిష్ఠానానికి మణిపూర్సంక్షోభాన్ని పరిష్కరించడం అంతసులభమైన కార్యంగా తోచడం లేదు.