వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌కు వాజ్‌పేయి ఆహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై చర్చకు పాకిస్తాన్‌ సైనికపాలకుడు జనరల్‌ ముషారఫ్‌ను ఆహ్వానిస్తూ ప్రధాని వాజ్‌పేయి పంపిన లేఖను ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్‌ సుధీర్‌వ్యాస్‌ శుక్రవారం నాడు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుస్‌ సత్తార్‌కు అందజేశారు.

వీలునుబట్టి సాధ్యమైనంత తొందరలో భారత పర్యటనకు రావల్సిందిగా జనరల్‌ ముషారఫ్‌ ఆయన అర్ధాంగి బేగం ముషారఫ్‌ల పేరిట ప్రధాని ఈ ఆహ్వానాన్ని పంపారు. పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలకు పరస్పర సహకారానికి చర్చల మార్గంలో భారత్‌ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే వున్నదని తమ ఆహ్వాన లేఖలో ప్రధాని పేర్కొన్నారు. పేదరికం ఇరుదేశాలను ఇబ్బంది పెడుతున్న ఉమ్మడి శత్రువని దానిని ఎదుర్కోవడానికి కలసికట్టుగా కృషి చేయాలని ముషారఫ్‌కు వాజ్‌పేయి పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X