ఆధునిక పోలీసువ్యవస్థ: దేవేందర్
హైదరాబాద్:భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లో మూడు కోట్లరూపాయల వ్యయంతో అత్యాధునిక పోలీసు సమాచారవ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు హోమంత్రిటి. దేవేందర్ గౌడ్ ప్రకటించారు. పోలీసు సంచారవ్యవస్థను ఆయన శుక్రవారంనాడిక్కడ ప్రారంభించారు.ఇందులో భాగంగా ట్రాఫిక్ మోటారు వాహనాలను,మోటారు సైకిళ్లను ఏర్పాటు చేసి సుశిక్షితులనునియమించారు.
మారుమూల ప్రాంతాల్లో కూడానేరాలను అదుపు చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని మంత్రిఅన్నారు. నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసుల సంఖ్యఒక్కటే సరిపోదని, ఆధునిక సాంకేతికపరిజ్ఞానంతో సమర్థతను కూడా పెంచుకోవడంఅవసరమని ఆయన అన్నారు.
కేసులను త్వరితగతినపరిష్కరిస్తేనే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని,ఇందుకుగాను సంచార వ్యవస్థకు చెందిన పోలీసులకుమానిసిక శాస్త్రవేత్తల చేత, ఇతర నిపుణులచేత శిక్షణ ఇప్పించామని పోలీసు డైరెక్టర్ జనరల్(డిజిపి) హెచ్. జె. దొర చెప్పారు.