వార్ చేతిలో ఒకరి హతం
కరీంనగర్:
ఇన్ఫార్మర్
అనే
ఆరోపణతో
కరీంనగర్
జిల్లాలో
పీపుల్స్వార్
నక్సలైట్లు
ఒక
వ్యక్తిని
దారుణంగా
హత్య
చేశారు.
మల్హర్మండలానికి
చెందిన
అజ్మిరా
సమ్మయ్య
అనే
గిరిజనున్ని
శుక్రవారం
నాడు
వార్
నక్సల్స్
కిరాతకంగా
హత్య
చేశారు.
సమ్మయ్య
గతంలో
జనశక్తి
నక్సల్స్లో
పనిచేసినట్టుగా
పోలీసులు
చెప్పారు.
సమ్మయ్య
పోలీసు
ఇన్ఫార్మర్గా
పనిచేస్తున్నాడని
గతంలో
జరిగిన
తీగలవాగు
ఎన్కౌంటర్కు
సమ్మయ్యనే
బాధ్యుడని
వార్
నక్సల్స్
ఆరోపించారు.
అయితే
వార్
ఆరోపణలను
సమ్మయ్య
కుటుంబ
సభ్యులు
తీవ్రంగా
ఖండించారు.
అనుమానం
వుంటే
ప్రజల్లో
పంచాయతీ
పెట్టి
నిజానిజాలు
తేల్చుకోవల్సిందని
ఉత్తపుణ్యానికి
తమ
సోదరున్ని
నక్సల్స్
పొట్టనబెట్టుకున్నారని
సమ్మయ్య
సోదరుడు
విలపిస్తూ
చెప్పారు.
తమ
సోదరుడు
ప్రశాంతంగా
పనిచేసుకుని
బతుకుతున్నాడని
ఆయన
అన్నారు.
కాగా
వార్
నక్సలైట్ల
హత్యాకాండ
పెరిగిపోవడంతో
వార్
టార్గెట్లుగా
వున్న
వ్యక్తులను
పిలిచి
ఆత్మరక్షణకు
తీసుకోవల్సిన
చర్యల
విషయంలో
కౌన్సిలింగ్
వంటిది
ఏర్పాటు
చేయనున్నట్టుగా
జిల్లా
ఎస్పి
ప్రవీణ్కుమార్
చెప్పారు.