మైక్రోసాఫ్ట్ నకిలీ ఎండిఅరెస్టు
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్మేనేజింగ్ డైరెక్టర్నని చెప్పుకుంటూ ప్రజలనుమోసం చేసిన ఒక స్త్రీని రంగారెడ్డి జిల్లా పోలీసులు శనివారంఅరెస్టు చేశారు. సత్యవతి అనే మహిళతో పాటు ఆమెసోదరి సూర్యలక్ష్మిని, తండ్రి పట్టాభిరామయ్యను కూడా పోలీసులుఅరెస్టు చేశారు. కాకినాడకు చెందిన వెంకట్రావు అనేవ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా కుషాయిగుడా పోలీసులు ఈముగ్గురిని అరెస్టు చేసినట్లు రంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటిండెంట్సురేంద్రబాబు చెప్పారు.
మౌలాలిలోని సత్యవతిఇంటిపై దాడి చేసి వారిని అరెస్టు చేయడంతో పాటునకిలీ సర్టిఫికెట్లను, బంగారు ఆభరణాలను, 25వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుఆయన తెలిపారు. మరో 16 లక్షల రూపాయలు సత్యవతిబంధువుల వద్ద వున్నాయని, వాటిని తమకుస్వాధీన పరచడానికి వారు అంగీకరించారని ఆయనచెప్పారు.
తాను మైక్రోసాఫ్ట్ ఎండిననిచెప్పి, మైక్రోసాఫ్ట్లో పెట్టుబడులు పెడితే లాభాలుఇతోధికంగా వస్తాయని నమ్మించి, అమెరికాలోని వివిధయూనివర్శిటీల నకిలీ సర్టిఫికెట్లు చూపి సత్యవతి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తనబంధువుల నుంచి 45 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుఆయన తెలిపారు. తమను సత్యవతి నమ్మించిమోసం చేసిన తీరును వెంకట్రావు విలేకరులకువివరించారు. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని సత్యవతిఅన్నది.