వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతలఆగదు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టునునిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుచెప్పారు. ఉన్నత స్థాయి సమావేశంలో శనివారంనాడుఆయన నీటి పారుదల ప్రాజెక్టుల పనుల తీరునుసమీక్షించారు. పులిచింతల ప్రాజెక్టునురాజకీయం చేయడం తగదని ఆయన ఈసమావేశంలో అన్నారు. పులిచింతలప్రాజెక్టులపై వున్న అపోహలను తొలగించేందుకు ఈనెల 31వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి మండవవేంకటేశ్వరరావు సమావేశానంతరం విలేకరులతోచెప్పారు. రాష్ట్రంలోని మూడు కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలకు పులిచింతల ప్రాజెక్టువల్ల ప్రయోజనం చేకూరుతుందని ఆయనఅన్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును వచ్చేజులై నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడుసమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పని తీరు బాగాలేదని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 60 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీరాంసాగర్‌ వరద కాలువకు భూమిసేకరణను లోక్‌ అదాలత్‌ ద్వారా చేపట్టనున్నట్లుఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆయన శ్రీశైలంఎడమ గట్టు కాలువ పనులు జరుగుతున్న తీరును కూడాఆయన సమీక్షించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీమా ప్రాజెక్టుక్లియరెన్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుఆయన తెలిపారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి మండవ వేంకటేశ్వరరావు, గనుల శాఖ మంత్రి ఉమా మాధవ రెడ్డి,నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులుపాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X