బస్సులో ఒకరి సజీవదహనం
విజయవాడ: విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద రింగ్రోడ్డు సర్వీస్రోడ్డులో నిలిపివున్న ప్రయివేట్ ట్రావెల్స్ ఎసి స్లీపర్ కోచ్ బస్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే సజీవదహనం కాగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు.
శ్రీ కృష్ణ ట్రావెల్స్ అనే సంస్థకు చెందిన ఎసి స్లీపర్ కోచ్ బస్సును హైదరాబాద్కు బయలుదేరడానికి సిబ్బంది సిద్ధం చేస్తుండగా బస్సులో ఒక్కసారిగా పేలుళ్లతో కూడిన మంటలు చెలరేగాయి. దీంతో రద్దీగా వున్న బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రజలు భయభ్రాంతులతో పరుగులు తీశారు.
బస్ ఎసి మిషన్లో ఏర్పడిన లోపాన్ని మెకానిక్ మురళీమోహన్ సరిదిద్దుతున్న సమయంలో గ్యాస్ సిలెండర్లు ఒక్కసారిగా పేలిపోయాయని తెలిసింది. సిలెండర్ల పేలుడుకు తోడుగా మంటలు కూడా రగుల్కోవడంతో మురళీమోహన్ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. కాగా ఆ సమయంలో బస్సులో వున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బస్పైన వున్న డ్రైవర్ మరో ఇద్దరు భయంతో కిందికి దూకడంతో వారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.