బాబుది కపటప్రేమ: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణా పట్ల ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని తెలంగాణా రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖరరావు విమర్శించారు. ఆరేళ్లలోశ్రీరాంసాగర్ కింద 50, 60 వేల ఎకరాలకు కూడా సాగు నీరందించనిచంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 60 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రకటించడం వట్టిదేననిఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.
బడ్జెట్ కేటాయింపులు లేకుండాశ్రీరాంసాగర్ పనులు పూర్తి చేసి సాగు నీరు అందించడం ఎలా సాధ్యమవుతుందనిఆయన ప్రశ్నించారు. రానున్న పంచాయతీరాజ్ ఎన్నికలనుదృష్టిలో పెట్టుకుని తెలంగాణాపై ముఖ్యమంత్రి కపట ప్రేమప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పనులుమొదటి దశలోనే ఆరేళ్లుగా ఆగిపోయాయనిఆయన అన్నారు. తెలంగాణాపై చంద్రబాబు కపట ప్రేమపంచాయతీ రాజ్ ఎన్నికల వరకేనని ఆయన అన్నారు.వచ్చే పంచాయతీరాజ్ ఎన్నికలు చంద్రబాబునాయుడుప్రభుత్వానికే కాకుండా తెలంగాణాను వ్యతిరేకించేవారందరికీ గుణపాఠం చెప్తాయని ఆయన అన్నారు.