వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహానాడు ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న అధికార తెలుగుదేశం పార్టీ మహానాడు సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాగరతీర నగరం పసుపువర్ణాన్ని సంతరించుకున్నది. వీధులన్నీ పసుపుపచ్చ జెండాలతో కళకళలాడుతున్నాయి. తెలుగుదేశం అగ్రనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలువెత్తు కటౌట్లను ముఖ్యమైన చౌరస్తాల్లో వుంచారు.

ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మంత్రులు, సీనియర్‌ నేతల ఆగమనం ప్రారంభం కావడంతో అధికార యంత్రాంగం హడావుడి పడిపోతున్నది. విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌గా వున్న హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ ఇప్పటికే ఈ ఏర్పాట్లపై అనేక దఫాలు అధికారులు, జిల్లా తెలుగుదేశం నేతలతో సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు 35 మంది మహానాడులో పాల్గొంటున్న కారణంగా అధికారులు పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకు అనువుగా వుంటుందనే కారణంతోనే మహానాడు సభలను, సాంస్కృతిక కార్యక్రమాలను పోర్ట్‌ ట్రస్ట్‌కు చెందిన స్టేడియంలో ఏర్పాటు చేశారు. సుమారు ఆరువేల మంది ప్రతినిధులు మహానాడులో పాల్గొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలపై సుమారు 40 తీర్మానాలను మహానాడు ఆమోదించే అవకాశం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X