జులై 25న జెడ్పీ, మండల ఎన్నికలు?
హైదరాబాద్: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్తులకు జులై నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జులై 25న ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికల ప్రక్రియ కూడా ఇమిడి వుంది.
ఓటర్లు ప్రాదేశిక నియోజకవర్గ ప్రతినిధులను ఎన్నుకుంటే, ఈ ప్రతినిధులు మండల పరిషత్తుల, జిల్లా పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవల్సివుంటుంది. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలను పూర్తి చేయాలంటే కనీసం వారంరోజుల ముందుగా ప్రాదేశిక సభ్యుల ఎన్నికల కార్యక్రమం ముగించడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ
ఎన్నికల
ఫలితాలు
వచ్చిన
ఒకటి
రెండు
రోజుల
తర్వాత
పరోక్ష
ఎన్నికల
కార్యక్రమం
వుంటుంది.
ఎన్నికల
నిర్వహణకు
వీలుగా
ప్రభుత్వం
జూన్
5వ
తేదీకల్లా
బిసి
ఓటర్ల
గుర్తింపు
ప్రక్రియను
పూర్తి
చేసి
10వ
తేదీకల్లా
అన్ని
జిల్లాల్లోనూ
రిజర్వేషన్లను
ఖరారు
చేయాల్సివుంటుంది.
ఈ
తంతు
పూర్తయిన
తర్వాత
జూన్
నెలాఖరులో
ఎన్నికల
నోటిఫికేషన్
జారీ
చేస్తారు.