సమైక్యాంధ్రలోనేస్వర్ణాంధ్ర: బాబు
విశాఖపట్నం:సమైక్యాంధ్రలోనే స్వర్ణాంధ్ర సాధన సాధ్యమవుతుందనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు అన్నారు. 1983 నుంచి ప్రతిఎన్నికల్లో ఒకసారి మినహా మిగతా అన్నిసార్లు తామేవిజయం సాధిస్తూ వస్తున్నామని ఆయన మహానాడు ప్రారంభోపన్యాసంలోఅన్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా విజయంతెలుగుదేశం పార్టీనే వరిస్తుందని ఆయనచెప్పారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి వున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణా పేరు ప్రస్తావించకుండా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం మహానాడు ఆదివారంనాడిక్కడ ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ పతాకావిష్కరణ చేసి మహానాడు సమావేశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాళష్ట్రంలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆయన విమర్శించారు. తాము రూపొందించి అమలు చేస్తున్న విజన్- 2020లో రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంక్షేమ కార్యక్రమాలు దెబ్బ తింటాయనే వాదనను ఆయన ఖండించారు.