వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మైసురా ప్రత్యేకరాయలసీమ పోరు
హైదరాబాద్: ప్రత్యేకరాయలసీమ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్తో ఉద్యమం చేపట్టాలనికాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) కార్యదర్శి డాక్టర్ఎం.వి. మైసురా రెడ్డి నిర్ణయించుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైచంద్రబాబునాయుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రంలోనేరాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందనిఆయన అన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధినిపట్టించుకోకుండా ప్రభుత్వం కోస్తాంధ్రకుప్రయోజనం చేకూర్చే పులిచింతల నిర్మాణానికితొందరపడుతోందని ఆయన విమర్శించారు. జూన్మొదటి వారంలో వివిధ పార్టీల, సంస్థల నాయకులతోసమావేశమై చిన్నరాష్ట్రాల ఏర్పాటు గురించి, అభివృద్ధిచెందని ప్రాంతాల గురించి చర్చలు జరుపుతామనిఆయన చెప్పారు. ఈ సమావేశంలోనే భవిష్యత్తు కార్యక్రమాన్నినిర్ణయించుకుంటామని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, May 27, 2001, 23:53 [IST]