వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జులైలో పంచాయతీ ఎన్నికలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ ఎన్నికలను జులై మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రాబాబునాయుడు గత రెండు రోజులుగా పార్టీ ముఖ్యనాయకులతో చర్చించి ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జూన్‌ 15వ తేదీన విడుదల కానుంది.

ఐదంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను మూడంచెలుగా మారుస్తూ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తూ వచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో ఎన్నికలను నిర్వహించకతప్పడం లేదు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను మూడంచెలుగా మార్చడానికి కాంగ్రెస్‌ అంగీకరించడంతో పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించలేకపోతోంది. దీంతో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X