వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లెబిసైట్‌ ప్రసక్తేలేదు: జస్వంత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై ప్రజాభిప్రాయసేకరణ (ప్లెబిసైట్‌) జరిపే ప్రసక్తి లేదనివిదేశాంగ శాఖ మంత్రి జస్వంత్‌ సింగ్‌ స్పష్టంచేశారు. కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమనేవిషయంలో రాజీ పడబోమని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. కాశ్మీర్‌ సమస్య భారత ఆంతరంగిక సమస్య మాత్రమేననిఆయన అన్నారు. పాకిస్థాన్‌ చర్చలకు వస్తే ద్వైపాక్షికవ్యవహారమని ఆయన చెప్పారు. ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ను చర్చలకుపిలిచే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌తోచర్చలు జరిపినప్పటికీ కాశ్మీర్‌పై భారత్‌ ఆధిపత్యంవిషయంలో రాజీ పడబోమని ఆయన అన్నారు.

గత చరిత్రకు భిన్నంగాపాకిస్థాన్‌, భారత్‌లు ముందుకు సాగాల్సి ఉన్నదని, భవిష్యత్తు సవాళ్లనుఎదుర్కోవడానికి ముందుకు రాకపోతే రెండుదేశాలు ప్రజలకు నష్టం చేసినవాళ్లమవుతామనిఆయన అన్నారు. పాకిస్థాన్‌ స్థితిలో మార్పు రాలేదనేది మీడియాప్రతినిధుల అంచనా మాత్రమేనని, అది తమఅంచనా కాదని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌తో ఏ విధమైన సంబంధాలనుకోరుకుంటున్నామనే విషయంలో భారత్‌ స్పష్టంగావున్నదని, భారత్‌తో ఏ విధమైన సంబంధాలను వాంఛించాలనేదిపాకిస్థాన్‌ నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. భారత్‌ పర్యటనసందర్భంగా తాను ఆల్‌ పార్టీ హురియత్‌కాన్ఫరెన్స్‌ నేతలతో చర్చలు జరుపుతాననిముషర్రాఫ్‌ అడిగే అవకాశం వున్నదని వస్తున్నవార్తలను ప్రస్తావిస్తూ- ముషర్రాఫ్‌ భారత ప్రధానిఆహ్వానం మేరకు ఇక్కడికి వస్తున్నారని, ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌తో కలిసే విషయం చర్చనీయాంశంకాదని జస్వంత్‌ సింగ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X