వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌టిఆర్‌ బాటలోనే దేశం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చూపిన బాటలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం నాడు ఎన్‌టిఆర్‌ 78వ జయంతి సందర్భంగా విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో వున్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులను అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదవారి సంక్షేమం కోసం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్‌టిఆర్‌ ఎంతగానో తపించారని చంద్రబాబు అన్నారు. దారిద్ర్య నిర్మూలనకు, పేదవారి సంక్షేమం కోసం ఎన్‌టిఆర్‌ చేపట్టిన పథకాలను తాము కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాలకు విస్తృత అధికారాలు కావాలని కేంద్రాన్ని కోరుతూ తొలుత గళమెత్తిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. ఆయన బాటలోనే తాము కూడా అధికారాల వికేంద్రీకరణ కోసం కేంద్రంపై వత్తిడి తెస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

సంస్కరణల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎన్‌టిఆర్‌ బాటను వదిలిందనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన చెప్పారు.
సీతమ్మధారలో క్షత్రియ సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా సోమవారం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజాభ్యుదయం కోసం అల్లూరి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి కదనరంగంలోకి దూకారని తెలుగుదేశం పార్టీ కూడా ప్రజాభ్యుదం కోసమే నిరంతరం పరిశ్రమిస్తున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X