వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌సిలోకిఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ(బిజెపి) శాసనసభ్యులు ఇరువురు తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌సి)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి ఎమ్మెల్యేలు రావులరవీంద్రనాథ్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి టిఆర్‌సిలో చేరడం తప్పమరో మార్గం లేదని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది రావులరవీంద్రనాథ్‌ రెడ్డి మంగళవారం ఒక తెలుగు టివీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నిసూచనప్రాయంగా చెప్పారు. జూన్‌ 3వ తేదీనజరిగే పార్టీ పదాధికారుల సమావేశంలో ప్రత్యేక తెలంగాణాఉద్యమానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తమకు తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరడం తప్పమార్గం లేదని ఆయన అన్నారు.

టిఆర్‌సి నేత కె. చంద్రశేఖర్‌రావుమాట చెప్పి దాన్ని ఆచరణలో పెట్టారని ఆయనఅన్నారు. బిజెపి మాట చెప్పి ఆచరణలో పెట్టడంలేదని, కాంగ్రెస్‌పై తెలంగాణా ప్రజలకు నమ్మకంలేదని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పొత్తు కొనసాగినంత కాలం ప్రత్యేక తెలంగాణాకుఅనుకూలంగా బిజెపి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవనిఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎమోషనల్‌గా ప్రత్యేక తెలంగాణాకు, సిద్ధాంతపరంగా బిజెపికి కట్టుబడివున్నానని, ప్రస్తుత స్థితిలో ఎమోషనల్‌కే ప్రాధాన్యం ఇస్తాననిఆయన అన్నారు.

పార్లమెంటు సభ్యుడుజితేందర్‌ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలోచోటు కల్పించినంత మాత్రాన సమస్య పరిష్కారంకాదని రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఇది ఒక వ్యక్తికిసంబంధించిన సమస్య కాదని, ప్రజలకుసంబంధించిన సమస్య అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X