వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంచనకే తెలంగాణాకు వరాలు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణా ప్రజలను వంచించడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడులో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వరాలుకురిపించారని తెలంగాణా రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్‌ రావు విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వాటిని ఎలా అమలు చేస్తారని ఆయన అడిగారు.

ముఖ్యమంత్రి చేసే ప్రకటనలనుప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. తెలంగాణా ఉద్యమం బలోపేతం కావడాన్ని గమనించి, వివిధ సంఘాలు, సంస్థలు తమకు మద్దతు ఇవ్వడం చూసి బెంబేలెత్తిపోయి చంద్రబాబు వరాలు కురిపిస్తున్నారని ఆయన అన్నారు. వరాలు కురిపించి తెలంగాణా ప్రజలను వంచించడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X