వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంచనకే తెలంగాణాకు వరాలు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణా ప్రజలను వంచించడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడులో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వరాలుకురిపించారని తెలంగాణా రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్ రావు విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వాటిని ఎలా అమలు చేస్తారని ఆయన అడిగారు.
ముఖ్యమంత్రి
చేసే
ప్రకటనలనుప్రజలు
నమ్మే
స్థితిలో
లేరని
ఆయన
అన్నారు.
తెలంగాణా
ఉద్యమం
బలోపేతం
కావడాన్ని
గమనించి,
వివిధ
సంఘాలు,
సంస్థలు
తమకు
మద్దతు
ఇవ్వడం
చూసి
బెంబేలెత్తిపోయి
చంద్రబాబు
వరాలు
కురిపిస్తున్నారని
ఆయన
అన్నారు.
వరాలు
కురిపించి
తెలంగాణా
ప్రజలను
వంచించడానికి
చంద్రబాబు
కుట్ర
పన్నారని
ఆయన
అన్నారు.
Comments
Story first published: Tuesday, May 29, 2001, 23:53 [IST]