వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
19 మంది ఎమ్మెల్యేలు బిజెపికిగుడ్బై
ఇంఫాల్: మణిపాల్లోరాజకీయ అస్థిరత మరింత తీవ్రమైంది. భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి చెందిన 26 మంది శాసనసభ్యుల్లో 19మంది పార్టీ నుంచి విడిపోయారు. మణిపూర్లోప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న తమ ఆశలకు బిజెపికేంద్ర నాయకత్వం గండికొట్డడంతో వారు పార్టీనివదిలిపెట్టారు.
పార్టీతో ఇప్పుడు కేవలంఏడుగురు శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని బిజెపికార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల ఇన్చార్జి పద్మనాభాచార్యచెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన శాసనసభ్యులు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకుఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.
పార్టీతో వున్న ఏడుగురిలో బిజెపి శాసనసభా పక్షనాయకుడు దోరేంద్ర సింగ్ వుండడం గమనార్హం. సమతా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకుదూరంగా వుండాలని బిజెపి, సమతా పార్టీ నేతలునిర్ణయించారు.
Comments
Story first published: Tuesday, May 29, 2001, 23:53 [IST]