వాజ్ పేయి సాహసంః ముషారఫ్
దుబాయ్ః కాశ్మీర్ పై చర్చలకు భారత ప్రధాని సిద్ధం కావడం హర్షించ తగిన పరిణామమని, ఇది సాహసోపేత నిర్ణయం అని పాకిస్తాన్సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. వాజ్పేయి ఆహ్వానం మేరకు నేను తప్పని సరిగా భారత్ వెళతానని ముషారఫ్ దుబాయ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగాపేర్కొన్నారు. భారత్ తో జరిగే చర్చలు ఫలితం సాధించే విధంగా కృషి చేస్తానని ముషారఫ్ చెప్పారు.
రాజకీయ, అంతర్జాతీయ ఒత్తిళ్ళకు తలొగ్గి వాజ్పేయి ప్రభుత్వం మాతో చర్చలకు అంగీకరించి వుండవచ్చునని, అయితే ఈ చర్చలు నిరర్థకం కాకుండా సకల చర్యలు తీసుకుంటామని ఆయనవివరించారు. అయితే భారత దేశంలో ఎప్పుడు పర్యటించేందీ ముషారఫ్ స్పష్టంగా ప్రకటించలేదు.
ముషారఫ్ భారత్ ను ముందు నుంచే చర్చలకు ఆహ్వానించి కాశ్మీర్విషయంలో పై చేయి సాధించినప్పటికీ, ఆసియా ఖండంలోపెరిగిపోతున్న పేదరికం పై చర్చిద్దాం అంటూ వాజ్పేయి ముషారఫ్ కు రాసిన లేఖతో ఈ అంశంలో వాజ్పేయి స్పష్టంగా పైచేయి సాధించారని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ తరుణంలో వాజ్పేయి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదంటూ ముషారఫ్ వ్యాఖ్యానించడంవిశేషం.