పంచాయతీ యుద్ధానికి సిద్ధం కండిః బాబు
హైదరాబాద్ః త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల సమరాంగణంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తన సత్తా చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు సమావేశాల చివరి రోజైన మంగళవారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మారుమూల ప్రజలకు చేరాలన్నా, పార్టీ పునాదులు పటిష్ఠంగా వుండాలన్నా పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ పట్టు సాధించడం అత్యంత అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
స్థానిక
సంస్థల
ఎన్నికలకు
కాంగ్రెస్
పార్టీయే
మోకాలడ్డి
తెలుగుదేశం
పార్టీపై
అభాండాలు
వేస్తున్నదని
చంద్రబాబు
ధ్వజం
ఎత్తారు.
ఐదంచెల
పంచాయతీ
రాజ్
వ్యవస్థను
రద్దు
చేయాలనిఅసెంబ్లీలో
తీర్మానించిన
కాంగ్రెస్
పార్టీ
ఢిల్లీలో
మాట
మార్చి
రాజకీయం
చేసిందని
ఆయన
ఆరోపించారు.
కాంగ్రెస్
బండారాన్ని
ప్రజల
ఎదుట
బట్టబయలు
చేయాలని
ఆయన
సూచించారు.
తెలుగుదేశం
పార్టీ
చేపట్టిన
అభివృద్ధి
కార్యక్రమాలను
ప్రజలకు
వివరించడం
ద్వారా
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
ఘనవిజయం
సాధించేందుకు
ప్రతి
ఒక్క
కార్యకర్త
కృషి
చేయాలని
ఆయన
పిలుపునిచ్చారు.