వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు ఆహ్వానంబలహీనత కాదు: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

మనాలి: కాశ్మీర్‌పై పాకిస్థాన్‌నుచర్చలకు ఆహ్వానించడం భారత్‌ బలహీనతకాదని ప్రధాని వాజ్‌పేయి అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనిమనాలిలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రధాని మంగళవారంవిలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్‌ సైనిక పాలకుడుపర్వేజ్‌ ముషర్రాఫ్‌ను చర్చలకు ఆహ్వానించడం భారత్‌బలహీనతగా భావించరాదని, దేశఆత్మస్థైర్యానికి నిదర్శనంగా పరిగణించాలని ఆయనఅన్నారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే ముషర్రాఫ్‌కుఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు. తమ కొత్తచొరవ సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లుఆయన చెప్పారు. కాశ్మీర్‌ సమస్యను తాముమతపరమైన సమస్యగా చూడడం లేదని,రాజకీయ సమస్యగానే చూస్తున్నామని ఆయనఅన్నారు.

ముషర్రాఫ్‌తో చర్చలకు తమను అనుమతించాలని ఆల్‌ పార్టీహురియత్‌ కాన్ఫరెన్స్‌ కోరడంపై ఆయనప్రతిస్పందిస్తూ- మొదట హరియత్‌కాన్ఫరెన్స్‌ నేతలు మొదట భారత ప్రభుత్వ ప్రతినిధికె.సి. పంత్‌తో చర్చలు జరపాలని ప్రధాని అన్నారు.చర్చలు జరపడానికి వీలుగానే హురియత్‌ నేతలనుజైళ్ల నుంచి విడుదల చేశామని ఆయన గుర్తుచేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ను తిరిగి జాతీయప్రజాస్వామ్య కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. వర్షాకాలం శీతాకాలం సమావేశాల ప్రారంభంలోగానే మంత్రి వర్గ విస్తరణ వుంటుందనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X