వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం నేతగా నాలుగోసారి బాబు
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కొత్త నేతగా పదవీబాధ్యతలు స్వీకరించారు. మిన్నంటిన హర్షధ్వానాల మధ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ప్రొఫెసర్ లక్ష్మన్న పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబుతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాగద్వేషాలు లేకుండా చిత్తశుద్దితో పార్టీ ప్రగతికి పరిశ్రమిస్తానని చంద్రబాబు ప్రమాణం చేశారు.
పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించగానేచంద్రబాబు తన దైన శైలిలో చేయిపైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. ఇతర కార్యవర్గ సభ్యులను చంద్రబాబు నియమిస్తారు. పార్టీ నేతగా ఎన్నికైన చంద్రబాబుకు ఒక నాయకుడు నిలువెత్తు నాగలిని బహుకరించారు.
Comments
Story first published: Tuesday, May 29, 2001, 23:53 [IST]