వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1450 కోట్లతోఇర్రిగేషన్‌ ప్రాజెక్టులు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వెనుకబడిన ప్రాంతాల్లోనినాలుగు జిల్లాల్లో వచ్చే రెండు నెలల్లో 1450కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ మొత్తాన్నినీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు చేస్తామనిఆయన అన్నారు. ఈ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా 9.25 లక్షలహెక్టార్లకు సాగునీరు అందిస్తామని ఆయనబుధవారం విలేకరుల సమావేశంలోచెప్పారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టునుత్వరలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఈప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 82 వేల కోట్లరూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 300 కోట్లరూపాయలు కేటాయించిందని ఆయన అన్నారు. కొందరురాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక తెలంగాణానినాదాన్ని లేవదీశారని ఆయన విమర్శించారు. ప్రజలనుంచి తెలుగుదేశం ప్రభుత్వంపై నిరసనవ్యక్తం కావడం లేదని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణాపై రాష్ట్ర బిజెపి నేతలు చేసే ప్రకటనలకుతాము ప్రతిస్పందించబోమని, కేంద్ర నాయకత్వం ప్రకటనలు చేసినప్పుడుమాట్లాడుతామని ఆయన అన్నారు. తాను చేసే పోరాటంవ్యక్తులపై, పార్టీలపై కాదని, వెనుకబాటుతనంపై,పేదరికంపై తన పోరాటం సాగుతుందని చంద్రబాబుఅన్నారు.

తెలంగాణా రాష్ట్ర సమితి పేరునుగానీ, సమితి నేత కె.చంద్రశేఖరరావు పేరును గానీ ప్రస్తావించడానికి ముఖ్యమంత్రినిరాకరించారు. తాను గుర్తించానా లేదా అనేది ముఖ్యంకాదని, ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. తమ పార్టీనుంచి వెళ్లిపోయినవారు కొత్త పార్టీలు ఇంతకుముందు పెట్టారని అంటూ వారేమయ్యారని ఆయనప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X