50 వేల వ్యవసాయవిద్యుత్ కనెక్షన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 50వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గంనిర్ణయించింది. మరో 2.57 లక్షల అక్రమ కనెక్షన్లనుక్రమబద్దీకరించాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలనుసమాచార, పౌర సంబంధాల మంత్రి డాక్టర్ ఎన్.శివప్రసాద్ విలేకరుల సమావేశంలోవెల్లడించారు. వెనుకబడిన తరగతులురిజర్వేషన్లను మరో పదేళ్ల పాటుకొనసాగించాలనే ప్రతిపాదనకు మంత్రి వర్గంఆమోద ముద్ర వేసింది.
మహానాడులో ప్రకటించనఐదు అంశాల డిక్లరేషన్ను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పంచసూత్రాలఅమలుకు నెలలో ఒక కార్యచరణ ప్రణాళికనురూపొందించనున్నట్లు, ఈ ప్రణాళిక రూపకల్పనకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.నీరు-మీరు, కుటుంబ నియంత్రణ, సంపూర్ణ అక్షరాస్యత, పర్యావరణపరిరక్షణ, పేదరిక నిర్మూలన అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్యచరణ ప్రణాళికనురూపొందిస్తారు.
పంచాయతీ సంస్థలకు నకిలీధృవీకరణ పత్రాలతో ఎన్నికయితే ఆ ఎన్నికనురద్దు చేసేందుకు తగిన చర్య తీసుకుంటూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రహదారులపైవిగ్రహాలను నెలకొల్పడాన్ని నిరోధించడానికి ఒక విధానాన్నిరూపొందించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.