కేంద్ర రుణాలు మాఫీః మహానాడు డిమాండ్
హైదరాబాద్ః ఆంధ్ర రాష్ట్రానికిపెను భారంగా పరిణమించిన సుమారు 32 వేల కోట్ల రుపాయల రుణాన్ని మాఫీ చేయాల్సిందిగావిశాఖపట్నంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వున్నఅప్పుల జాబితాలో కేంద్రం నుంచి తీసుకున్న రుణం గుదిబండలా తయారైందని, దానిని తక్షణం మాఫీ చేయాలని మహానాడు కోరింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఆమెదించిన తీర్మానంలో తెలుగుదేశం పార్టీ ఈ మేరకు డిమాండ్ చేసింది.
కేంద్రంలోని
ఎన్డీఏ
ప్రభుత్వానికి
మద్దతు
కొనసాగించాలని,
అయితే
లౌకిక
వాదానికి
భంగం
కలిగిస్తే
సహించబోమని
స్పష్టం
చేసింది.
కేంద్ర-రాష్ట్ర
సంబంధాలను
తిరిగి
నిర్వచించాలని
తెలుగుదేశం
పార్టీ
డిమాండ్
చేసింది.
రాష్ట్రాలపై
కేంద్రం
ఇంకా
కర్రపెత్తనం
చేయాలనుకోవడం
బాధాకరమని
తెలుగుదేశం
పార్టీ
స్పష్టం
చేసింది.
మూడు
రోజుల
పాటు
అత్యంత
వైభవంగా
జరిగిన
తెలుగుదేశం
పార్టీ
మహానాడు
వేడుకలు
మొత్తంమీద
ఫలంవంతంగా
ముగిసాయని
పార్టీ
వర్గాలు
అభిప్రాయపడ్డాయి.